-
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్బాస్
-
అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న వైనం
-
తొలి ఎలిమినేషన్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో ‘బిగ్బాస్ 9’ సీజన్ తొలి ఎపిసోడ్ నుంచే హీట్ పెంచింది. ఈ సీజన్కు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. గత ఆదివారం ప్రారంభమైన ఈ సీజన్లో, తొలి ఎలిమినేషన్ కూడా జరిగింది. ఆదివారం (సెప్టెంబర్ 14) నాటి ఎపిసోడ్లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
శ్రష్టి వర్మ ఇంటర్వ్యూ
ఎలిమినేషన్ అనంతరం నాగార్జున ఆమెతో ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్నలు వేశారు. నిజాయితీగా ఉన్నవాళ్లు ఎవరు? అన్న ప్రశ్నకు శ్రష్టి వర్మ, రాము రాథోడ్, మనీశ్, హరీష్, ఆషా షైనీ పేర్లు చెప్పింది. అదే విధంగా, కెమెరా ముందు నటించేవాళ్లు ఎవరు? అన్న ప్రశ్నకు రీతూ చౌదరి, తనూజ, భరణి పేర్లు వెల్లడించింది.
బిగ్బాస్ హౌస్లోకి ప్రవేశించే ముందు, “ఇలాంటి షోలలో అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది” అని శ్రష్టి పేర్కొంది. ఎలిమినేషన్ తర్వాత, “ఇక్కడ రెండు వారాలు నటించడం సులభం.. కానీ ఆ తర్వాత అసలు రంగు బయటపడుతుంది” అంటూ మరింత స్పష్టత ఇచ్చింది.
బిగ్బాస్ 9 స్పెషల్
సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 15 మంది హౌస్లోకి ప్రవేశించగా, వారిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఉన్నారు. గత వారం నామినేషన్ ప్రక్రియలో సంజన, తనూజ సేవ్ కాగా, మిగతా ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. చివరికి శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. బిగ్బాస్ అభిమానులకు ఇది స్వల్ప ఆశ్చర్యం కలిగించింది.
Read also : Telangana : కుక్కల నుంచి తప్పించుకునేందుకు ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు!
